రాష్ట్రీయం

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా రైతుల భూమి తీసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సేకరించనున్న భూముల విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారి భూమి నుంచి కదల్చరాదని హైకోర్టు ఏపి రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి జారీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ గత ఏడాది జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కొండపు రమణ, మరో 45 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాలం చెల్లిన ఆర్డినెన్సుపై నోటిఫికేషన్ జారీ చేసే హక్కు విజయనగరం జిల్లా కలెక్టర్‌కు లేదని రైతుల తరఫున న్యాయవాది వాదించారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.