రాష్ట్రీయం

టిడిపిలో చేరిన పలమనేరు ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 16: చిత్తూరు జిల్లా పలమనేరు వైసిపి ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, గురువారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. సిఎం చంద్రబాబు అమరనాథ్‌రెడ్డికి పచ్చకండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుంచి తాను పార్టీలో పనిచేసినట్లు గుర్తుచేశారు. గత 12 యేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నందున నియోజకవర్గ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అమ్ముడు పోలేదని నేను నా బిడ్డమీద ప్రమాణం చేసి చెప్తున్నా.. జగన్ తన బిడ్డలమీద ప్రమాణం చేసి నిరూపించగలరా అని అమర్‌నాథ్ సవాల్ విసిరారు.

చిత్రం పలమనేరు వైసిపి ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డిని టిడిపిలో చేర్చుకుంటున్న చంద్రబాబు