రాష్ట్రీయం

రంగస్థల, సినీ నటుడు జెవి రమణమూర్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: ప్రముఖ రంగస్థల నటుడు జెవి రమణమూర్తి (84) కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. జెవి రమణమూర్తి, ప్రముఖ సినీనటుడు జెవి సోమయాజులు సోదరుడు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకులాం గ్రామంలో జెవి జన్మించారు. 1957లో ఎమ్మెల్యే సినిమాతో 24వ ఏట సినీరంగ ప్రవేశం చేశారు. రమణమూర్తి సుమారు 150 సినిమాల్లో నటించారు. మాంగల్యబలం, బాటసారి, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇది కథకాదు, శుభోదయం, ఆకలి రాజ్యం, సప్తపది, శుభలేఖ లాంటి హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాలతో పాటు నాటక రంగంలో కొనసాగారు. 20వ ఏట నుంచే ఏకధాటిగా 43ఏళ్ల పాటు గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని స్వీయ దర్శకత్వంలో సుమారు వెయ్యిసార్లు ప్రదర్శించి అపర ఖ్యాతి గడించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1933 మే 20వ తేదీన జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే నాటక రంగంపై ఆసక్తి కనబరచే వారు. ప్రముఖ రంగస్థల నటుడిగా విశ్వశాంతి అవార్డు పొందిన రమణమూర్తి నాటకరంగానికి అందించిన సేవలను పలువురు సినీ నటులు శ్లాఘించారు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రమణమూర్తి మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురు నటీ నటులు సంతాపం తెలిపారు.