రాష్ట్రీయం
చైనాకు చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 26 June 2016
విజయవాడ, జూన్ 25: ప్రపంచ ఆర్థిక వేదికలపై ఆంధ్రప్రదేశ్ వాణిని వినిపించేందుకు క్రమం తప్పకుండా హాజరయ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనాలో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. గుంటూరు జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నారు. రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన హాంకాంగ్కు బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.25కు హాంకాంగ్ ఎయిర్పోర్టుకు చేరుకుని సాయంత్రం 4.35కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జరిగే టియాంగ్జిన్ నగరానికి చేరుకుంటారు.