రాష్ట్రీయం

‘ఉస్మానియా ఆస్పత్రిలో త్వరలో కొత్త టవర్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉస్మానియా ఆస్పత్రిలో త్వరలో కొత్త టవర్స్ నిర్మించనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టవర్స్‌కు శంకుస్థాపన చేస్తారని, నిర్మాణ పనులకు సమాయత్తం కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితులను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్టు, దీనిలో భాగంగానే ఉస్మానియాలో కొత్త టవర్స్ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యం అందించాలనేది లక్ష్యం అని అన్నారు. ఈ మధ్య ఉస్మానియాలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి ఆస్పత్రి ప్రతిష్ఠను పెంచుతున్నారని తెలిపారు.