రాష్ట్రీయం
9మందిపై హైకోర్టు వేటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 July 2016
హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ న్యాయాధికారులు, కోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతున్నారనే అభియోగంపై హైకోర్టు గురువారం సస్పెన్షన్ల వేటును కొనసాగించింది. రంగారెడ్డి జిల్లా జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి బి లక్ష్మారెడ్డి, రాష్ట్ర సంఘం కార్యదర్శి జగన్నాథం, ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి సహా మొత్తం తొమ్మిది మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఇంతవరకు 11 మంది న్యాయాధికారులను హైకోర్టు గత మూడు రోజుల్లో సస్పెండ్ చేసిన విషయం విదితమే. మరోవైపుతెలంగాణ న్యాయవాదులు ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.