రాష్ట్రీయం

ఎపిజిడిసికి 48 ఎకరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: కాకినాడకు సమీపంలోని వాకలపూడి వద్ద ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ సంస్థకు 48 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఇక్కడ ఫ్లోటింగ్ స్టోరేజి, రీ గ్యాసిఫికేషన్ యూనిట్‌ను ఎల్‌ఎన్‌జి టెర్మినల్ కోసం నిర్మిస్తారు. దీని నిమిత్తం ఈ భూమిని కేటాయించారు. జిల్లా కలెక్టర్ ఈ భూమికి సంబంధించి గజం తొమ్మది వేల రూపాయలుగా నిర్ణయించగా, రాష్ట్ర ప్రభుత్వం గజం రెండు వేల రూపాయల ధరను స్థిరీకరించింది. ఏపిజిడిసి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.