రాష్ట్రీయం

ఆలయాల కూల్చివేతతో ఆంధ్రకు అరిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 2: విజయవాడలో హిందూ దేవాలయాలను రాత్రికి రాత్రే కూల్చివేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టం అని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. రుషీకేష్‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామి శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. దేవాలయాల నిర్మాణమైనా, వాటిని తొలగించాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే జరగాలన్నారు. దేవాలయాలను బలమైన కారణాలతో తొలగించాలని ప్రభుత్వం భావిస్తే, తొలుత అన్ని కోణాల్లో పరిశీలించాలని, హిందూమత పెద్దలు, పీఠాధిపతులు తదితరులతో చర్చించాలని సూచించారు. హిందూ దేవాలయాలపై ఉగ్రవాదులుకాని, అన్యమతస్తులు కాని దాడి చేసినా, కించపరిచినా హిందూసమాజం యావత్తూ అడ్డుకుంటుందన్నారు. అయితే హిందూ సమాజానికి రక్షణ కల్పించేవారికి దేశప్రజలంతా కలిసి అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు. కానీ నవ్యాంధ్రప్రదేశ్‌లో మరీ ముఖ్యంగా రాజధాని హోదాలో విలసిల్లుతున్న విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో, రోడ్ల విస్తరణ పేరుతో 30 కిపైగా దేవాలయాలను రాత్రికి రాత్రే కూల్చివేయడం దుర్మార్గమని స్వరూపానందేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కూల్చిన ఆలయాల్లో స్వయంభూ ఆలయాలు, రుషులు ప్రతిష్ఠ చేసిన ఆలయాలు మరికొన్ని, కారణజన్ములైన ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు తదతర మహానుభావుల చేతులమీదుగా ప్రతిష్ఠ జరిగిన ఆలయాలు కూడా ఉన్నాయన్నారు. ఆలయాల కూల్చివేతను ప్రశ్నించిన వారిని దూషిస్తున్నారని పేర్కొంటూ, ఈ విధానం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే స్పందించాలని స్వరూపానందేంద్ర కోరారు.