రాష్ట్రీయం

అధికారిపై కాల్పులు జరిపి కర్నూలు జవాను ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రవరం, జూలై 7: జమ్మూ, కాశ్మీర్‌లో పై అధికారితో జరిగిన గొడవ కారణంగా కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన వెంకటకృష్ణయ్య అధికారిపై కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మిలిటరీ అధికారులనుంచి తమకు సమాచారం అందినట్లు వెంకట కృష్ణయ్య తమ్ముడు తిరుమలేష్ తెలిపారు. కాగా గంధేర్‌బల్ జిల్లాలోని సపాపోరాలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో వెంకటకృష్ణయ్య అనే జవాను మృతి చెందగా, హవాల్దార్ మనోహర్ సింగ్ అనే మరో జవాను గాయపడినట్లు ఆర్మీ అధికారి ఒకరు శ్రీనగర్‌లో చెప్పారు. దీనిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్లు ఆ అధికారి చెప్పారు. పై అధికారితో తలెత్తన గొడవలో వెంకటకృష్ణయ్య అధికారిపై కాల్పులు జరిపి గాయపరిచి, తాను ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా, కృష్ణయ్య గత అయిదేళ్లుగా ఆర్మీలో పని చేస్తున్నాడు. అతనికి తల్లి రమాదేవి, ఇద్దరు చెల్లెళ్లు కళ్యాణి, వెంకటలక్ష్మమ్మ, తమ్ముడు తిరుమలేష్ ఉన్నారు.

వెంకటకృష్ణయ్య (ఫైల్‌ఫొటో)