రాష్ట్రీయం

మృత్యువుతో పోరాడి.. చికిత్స పొందుతూ చిన్నారి రమ్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/పంజగుట్ట, జూలై 9: ఇటీవల పంజగుట్ట కారు ప్రమాదంలో గాయపడిన ఎనిమిదేళ్ల రమ్య తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడి, శనివారం కన్నుమూసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3లోని పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక ముందు పమ్మి రాజేష్ (34) కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తుండగా, అదే సమయంలో ఎదురుగా ఓ కారులో మద్యం సేవించిన నలుగురు యువకులు అతివేగంతో వచ్చి, డివైడర్‌ను ఢీకొట్టారు. అదుపు తప్పిన కారు రోడ్డుకు అటువైపు వెడుతున్న రాజేష్ కారుపై పడడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. అదే కారులో పక్కన కూర్చున్న రాజేష్ తండ్రి సత్యనారాయణ (65), రాజేష్ సోదరుడి కుమార్తె రమ్య (8), రమ్య తల్లి రాధికలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని కేర్ ఆసుపత్రిలో చేర్పించగా రమ్య బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లింది. తొమ్మిది రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడింది.

మృతి చెందిన రమ్య (ఫైల్‌ఫొటో)