ఆంధ్రప్రదేశ్‌

రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూలై 29: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్రతీర్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును శుక్రరవారం రాజధానిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆగస్టు 17 నుంచి జరుగనున్న 345వ శ్రీ రాఘవేంద్రస్వామి సప్తఆరాధనోత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్రతీర్థులును సిఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. మఠంలో దాదాపు రూ.10 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న శిలామంటపం పనులు, శ్రీ మూలరాముల స్వర్ణ మంటపం, స్వర్ణ గోపురం నిర్మాణం పనులు, ఇతర అభివృద్ది పనులను పీఠాధిపతి సిఎంకు వివరించారు. కృష్ణా పుష్కరాలు ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరగాలని పీఠాధిపతి అభిలాషించారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణం పట్ల పీఠాధిపతి హర్షం వ్యక్తం చేశారు. త్వరలో మంత్రాలయం సందర్శించి స్వామిని దర్శించుకుంటామని ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం.

సిఎం చంద్రబాబుకు శ్రీరాఘవేంద్రస్వామి
చిత్రపటాన్ని అందిస్తున్న పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు