రాష్ట్రీయం

భద్రాద్రి వద్ద గోదారమ్మకు నవ దంపతుల పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 8: అంత్య పుష్కరాల్లో భాగంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. 9వ రోజు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్నానఘట్టాలు కిక్కిరిశాయి. గోదారమ్మ వందనం అంటూ భక్తులు ప్రణమిల్లారు. పుష్కర స్నానాలు చేసి తర్పణాలు, పిండప్రదానాలు సమర్పించుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగానూ మహిళలు గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తరపున పునర్వసు మంటపంలో రామయ్య ప్రచారమూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వామికి ముత్తంగి సేవ నిర్వహించారు. పుష్కర స్నానం చేసిన తర్వాత శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని భక్తులు వెనుదిరిగారు.