రాష్ట్రీయం

మల్లన్నసాగర్ భూముల సేకరణపై విచారణ చేస్తాం: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: మల్లన్నసాగర్‌తో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారణ చేపడుతుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథమ్ పేర్కొన్నారు. కాని రాజకీయ ప్రయోజనాలు, ఇతర దురుద్దేశ్యాలతో దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైకోర్టు మల్లన్నసాగర్ భూముల సేకరణకు సంబంధించి జీవో 123పై హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు పై విధంగా పేర్కొంది. పిటిషనర్ల భూముల జోలికి వెళ్లమని అడ్వకేట్ జనరల్ ఇచ్చిన హామీని హైకోర్టు విశ్వసించి పరిగణనలోకి తీసుకుంటున్నట్లు హైకోర్టు పేర్కొంది.