రాష్ట్రీయం

నయాం అనుచరుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 17: గ్యాంగ్‌స్టర్ నయాం ఎన్‌కౌంటర్ తదనంతరం వెలుగుచూసిన కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంఎ రవూఫ్ కిడ్నాప్ కేసులో నిందితులైన జిల్లా కేంద్రానికి సమీపంలోని నగునూర్ మాజీ సర్పంచ్ భర్త గోపి, మంథని ప్రాంతానికి చెందిన రాంబాబు అలియాస్ రమేష్‌లను బుధవారం అరెస్టు చేసి 14రోజుల రిమాండ్‌కు తరలించారు. నయాం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిబ్ విచారణ అధికారులు వారి వద్ద నుండి రెండు కార్లు, రెండు ఆయుధాలు, భూసంబంధ రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

చిత్రం.. కరీంనగర్ జిల్లా కోరుట్లలో అరెస్టు చేసిన నయాం అనుచరులైన నగునూరు మాజీ సర్పంచ్ భర్త గోపి, మంధనికి చెందిన రాంబాబు అలియాస్ రమేశ్‌ను కరీంనగర్ జైలుకు తరలిస్తున్న పోలీసులు