రాష్ట్రీయం

సోదరీ సోదరుల బంధానికి ప్రతీక రక్షాబంధన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: సోదరి, సోదరుల అనుబంధానికి నిజమైన నిర్వచనం రక్షాబంధన్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోదరీ సోదరుల వాత్సల్యాన్ని ద్విగుణీకృతం చేసేది రక్షాబంధన్ ఉత్సవమని అన్నారు. ఆడపడచులకు, అక్కా చెల్లెళ్ళకు తమ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని చంద్రబాబు చెప్పారు. మహిళా సంక్షేమానికి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్, షీ ఆటో పథకాలను ప్రారంభించామని తెలిపారు. అన్న అమృత హస్తం పథకం కింద తల్లులకు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు 2019-20 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, పేద ముస్లిం యువతులకు దుల్హన్, గిరిజన యువతులకు గిరి పుత్రిక కల్యాణ పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనకు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, తెలంగాణ టిడిపి నేత సీతక్క, కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గద్దె అనూరాధ తదితరులు రాఖీ కట్టారు. వీరిని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.

చిత్రం.. ఏపి మంత్రి పీతల సుజాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడలో రాఖీ కడుతున్న దృశ్యం