రాష్ట్రీయం

కుల సమస్యను రాజేసింది చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 28: కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ నెలాఖరువరకే గడువు ఇచ్చామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు సిఎం కుర్చీలో కూర్చోవటం కోసం కాపుజాతిని నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కుల సమస్యను తీసుకొచ్చింది చంద్రబాబేనన్నారు. ఈ నెలాఖరులోగా ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే సెప్టెంబర్ 11న 13 జిల్లాల కాపు సంఘం నాయకులతో రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. ఈ సమావేశంలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదిలావుండగా ప్రత్యేక హోదాకు తాము వ్యతిరేకం కాదన్నారు. దానికోసం చంద్రబాబు ఆందోళనలు చేస్తే తాము కూడా పాల్గొంటామన్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం మాత్రమే పోరాడుతున్నారని, తాము మాత్రం తమ జాతి అభివృద్ధి కోసం రోడ్డెక్కామని చెప్పారు. తాము చేసే ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిని ప్రజలే అడ్డుకుంటారన్నారు. జీవో నెంబర్ 30ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.