ఆంధ్రప్రదేశ్‌

మోదీజీ... థాంక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 13: ప్రత్యేక హోదాకు సమానంగా వచ్చే అన్ని వనరులను అయిదేళ్లపాటు ప్యాకేజీ రూపంలో అందించేందుకు కేంద్రం అంగీకరింనందుకు ఏపి సిఎం చంద్రబాబు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు తాను ఉదయమే ప్రధానికి ఫోన్ చేసి థాంక్స్ చెప్పినట్టు ముఖ్యమంత్రి స్వయంగా విలేఖరులకు తెలిపారు. ప్యాకేజీకి సంబంధించి అనంతర చర్యలను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని కోరానన్నారు. ప్రాజెక్టును 2018నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్యాకేజీ విషయంలో రకరకాల వాదనలు విన్పిస్తున్నాయని, విపక్షాలు దీన్ని ఆవకాశంగా తీసుకుని హోదాను సెంటిమెంట్‌గా మార్చివేసి, జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని సిఎం ఆరోపించారు.