రాష్ట్రీయం

దాతలకే కాటేజీ గదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 18: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజీ దాతలకు మాత్రమే గదులు కేటాయించనన్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 6, 7 తేదీల్లో మాత్రం కాటేజీ దాతలకు కూడా ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాటేజీ దాతలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతలకు రెండు గదులను రెండు రోజులపాటు కేటాయించనున్నట్లు తెలిపారు. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 5 రోజులు ముందుగానే సెల్ఫ్‌డోనార్ స్లిప్పులను తిరుమలలోని రిసెప్షన్-1 ఉప కార్యనిర్వహణాధికారికి సమర్పించాల్సి ఉంటుంది. కాటేజీ దాతలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.