ఆంధ్రప్రదేశ్‌

సింహపురి సూపర్‌ఫాస్ట్ వేళల్లో నేటినుంచి మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 30: ప్రయాణికుల సౌకర్యార్థం గూడూరు - సికింద్రాబాద్ నడుమ నడిచే సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అక్టోబర్ 1నుంచి మార్చిన వేళలు అమలులోకి రానున్నాయి. ఈరైలు గూడూరులో కొత్త సమయం ప్రకారం సాయంత్రం 6:50గంటలకు బయలుదేరి 7:11కు నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి , బిట్రగుంట, కావలి, సింగరాయకొండ మీదుగా ఒంగోలుకు 8:40కు చేరుకుంటుంది. తర్వాత చీరాల, తెనాలి మీదుగా విజయవాడకు 11.11కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 11:23 గంటలకు బయలుదేరి మదిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేట మీదుగా తెల్లవారు జామున 5:40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి గూడూరుకు వచ్చేవేళల్లో ఎటువంటి మార్పూ ఉండదు. అయితే ప్రస్తుతం ఉదయం 9:20లకు గూడూరు వచ్చే ఈ సింహపురి ఎక్స్‌ప్రెస్ సవరించిన వేళల వల్ల 8:50లకే చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.