రాష్ట్రీయం
ధర్మాసనానికి ఫిరాయింపుల కేసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 November 2016
హైదరాబాద్, నవంబర్ 3: టిడిపిలో చేరిన నలుగురు వైకాపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారణ నిమిత్తం హైకోర్టు ధర్మాసనానికి నివేదిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ పి నవీన్ రావు గురువారం ప్రకటించారు. టిడిపిలోకి ఫిరాయించిన పి రామారావు, ఎం అశోక్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి వైకాపా తరఫున ఎన్నికై టిడిపిలో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యేలు బి రాజేంద్రనాథ్ రెడ్డి, డి తిప్పారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది.