రాష్ట్రీయం

నోట్ల రద్దుతో జనం సతమతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. పెద్ద నోట్ల రద్దు ఉద్యోగులు, పేదలు, రైతులు, శ్రామికులపై పెనుప్రభావం చూపుతోందని పేర్కొంటూ, దీనిపై సంబంధిత అధికారులకు, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆ ఫిర్యాదులో కెవిపి కోరారు. పెద్ద నోట్ల రద్దును ప్రకటించే ముందు సరైన ఏర్పాట్లు చేసి ఉంటే ప్రజలు ఇబ్బందులు పడేవారు కాదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేంద్రానికి జాతీయ మానవ హక్కుల సంఘం సరయిన ఆదేశాలు జారీ చేస్తుందని కెవిపి సోమవారం ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.