రాష్ట్రీయం

పెద్ద ఆలయాల్లోనే బయోమెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది పెద్ద దేవాలయాల్లోనే (సింహాచలం, అన్నవరం, కనకదుర్గ- విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం మొదలగునవి) బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు అమలు చేయాలని అర్చక సంక్షేమ నిధి ట్రస్టు నిర్ణయించింది. ఇటీవల జరిగిన ట్రస్టు సమావేశం మినట్స్‌ను బుధవారం విడుదల చేశారు. అర్చక సర్వీసు నిబంధనలను ప్రభుత్వం ఇప్పటి వరకు రూపొందించలేదు. సర్వీసు నిబంధనలు రూపొందించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సర్వీసు నిబంధనలు లేకుండా అర్చకులు, ఇతర ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ విధానంలో అమలు చేయడానికి వీలులేదని అర్చక సమాఖ్య ప్రతినిధులు స్పష్టం చేశారు.
అర్చక సంక్షేమ నిధి ట్రస్టు సమావేశానికి హాజరైన అర్చక సంఘం ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు, సిఎస్ రంగరాజన్‌లు సర్వీసు నిబంధనలను రూపొందించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు రూపొందించే వరకు బయోమెట్రిక్ విధానాన్ని కేవలం పెద్ద దేవాలయాలకే పరిమితం చేయాలని వారు కోరారు. వారి కోరికను మన్నించి, చిన్న దేవాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకురావద్దని ట్రస్టు కోరుతోంది.