రాష్ట్రీయం

పాతబస్తీలో ప్రహ్లాద్ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ శనివారం హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న ప్రధాని శనివారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పర్యటించగా, ఆయన సోదరుడు మాత్రం సామాన్య సందర్శకుడిలా పాతబస్తీలో ప్రత్యక్షమయ్యారు. ప్రహ్లాద్ మోదీ శనివారం ఉదయం పాతబస్తీ చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ, నిర్వాహక సభ్యులు ప్రహ్లాద్ మోదీకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ చారిత్రక నగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌కు రావటం తనకెంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. నగర ప్రజల ముఖాలు చాలా ఆనందంగా కన్పిస్తున్నాయని, నోట్ల రద్దుతో చిల్లర సమస్యలు వారిలో కన్పించటం లేదని వ్యాఖ్యానించారు. అమ్మవారి దర్శనానంతరం ఆయన అక్కడి నుంచి సమీపంలో ఉన్న చౌమోహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.

శనివారం హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మిఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్న ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ

చిత్రం...