ఆంధ్రప్రదేశ్‌

పెద్దశేష వాహనంపై పద్మావతిదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 27: లోక రక్షణి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ఉదయం అమ్మవారు పెద్దశేష వాహనంపై వైకుంఠ నాథుడు శ్రీలక్ష్మీనారాయణుడి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మవారు నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

పెద్ద శేష వాహనంపై దర్శనమిస్తున్న పద్మావతి దేవి