ఆంధ్రప్రదేశ్‌

గుల్లలమోద రేవులో నలుగురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 27: కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద సమీపంలోని సముద్రంలో ఆదివారం సాయంత్రం నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన 15మంది యువకులు ఆదివారం విహారయాత్రగా నాగాయలంక లైట్‌హౌస్‌కు వచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో సరదాగా గడిపిన వారంతా మధ్యాహ్నం 4గంటల సమయంలో సముద్ర స్నానాలకు వెళ్ళారు. సుమారు గంట పాటు స్నానాలు చేసిన వీరిలో ఖమ్మం జిల్లా మధిర మండలం మెడుపల్లి గ్రామానికి చెందిన వేల్పుల లక్ష్మణరావు (25), ఎర్రుపాలెం మండలం సఖినేటిపల్లి గ్రామానికి చెందిన రామాల లక్ష్మణరావు (21), గాడపాటి అనిల్ కుమార్ (19), కొండాల రమేష్ (25) గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు వారి ఆచూకీ తెలియరాలేదు. వీరంతా విజయవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.

చిత్రం... గల్లంతయన వేల్పుల లక్ష్మణరావు, అనిల్, రమేష్, లక్ష్మణరావు