రాష్ట్రీయం

రూ.31లక్షల కొత్త నోట్లు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 2: నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠా ఒకటి టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడింది. వీరి నుంచి సుమారు రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసిపి పి మురళీధర్, సిఐ సురేష్‌రెడ్డి బృందం శుక్రవారం ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద దాడు లు నిర్వహించారు. అనుమానాస్పదం గా సంచరిస్తున్న గుంటూరు జిల్లా తుళ్ళూరుకు చెందిన జి వంశీకృష్ణ, పొన్నూరుకు చెందిన ఎం నాగ వెంకట సునీల్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండువేల రూపాయలు కొత్త నోట్లతో ఉన్న 31లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లక్షా 20వేలు పాత నోట్లు ఇస్తే.. లక్ష రూపాయలు కొత్తనోట్లు ఇస్తామంటూ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. లక్షల్లో కొత్త నోట్లు పట్టుబడడం చర్చనీయాంశమైంది.