రాష్ట్రీయం

ఇ-పోస్‌లు వచ్చేశాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 3: పెద్దనోట్ల చలామణిపై ఆంక్షల విధింపు, కొత్త నోట్ల కొరత వల్ల రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి నగదు తెప్పిస్తూ మరోవైపు నగదు రహిత విధానం కోసం ఇ-పోస్ మిషన్లు తెప్పించడం కోసం చేస్తున్న కృషి ఫలించింది. ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల్లో రూ.2,420 కోట్ల విలువైన నోట్లు రప్పించారు. ఇప్పటివరకు ప్రభుత్వ శాఖలకు 7,832 ఇ-పోస్ మిషన్లు సరఫరా అయ్యాయి. నగదు రహిత లావాదేవీలకు పిఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్), పిఓపి (పాయింట్ ఆఫ్ పర్చేజ్), ఎం-పిఓఎస్ (మొబైల్ పోస్), ఎఫ్-పిఓస్ (్ఫంగర్ ప్రింట్ పోస్), డిజిటల్ సెక్యూర్ పోస్ (స్మార్ట్ ఫోన్ ద్వారా ఉపయోగించేది), కార్డ్‌రీడర్ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఈ మిషన్ల వాడకం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి వాడకాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం వాడుతున్న మిషన్లు కాకుండా 64,678 ఇ-పోస్ మిషన్లు అవసరం కాగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 20 రోజుల్లో యుద్ధప్రాతిపదికన 7,835 మిషన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చిన్నా పెద్దా అన్ని రకాల వాణిజ్య సంస్థల్లో కూడా ఈ మిషన్లను వాడే ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు, హోటళ్లు, బార్లు, వైన్‌షాపులు, వివిధ రకాల షోరూమ్స్, షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఇప్పటికే వీటిని వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని విస్తృతంగా వినిగించడానికి అటు చిన్న చిన్న వ్యాపారులకు, ఇటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల వర్తకుల వివరాలను సేకరించి వారికి ఇ-పోస్ మిషన్లు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ-పోస్ మిషన్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడినప్పడికీ, కావలసినన్ని మిషన్లు వున్న పళంగా సరఫరా చేయడం సాధ్యం కాదు. వివిధ ప్రభుత్వ శాఖలకు కావలసిన ఈ-పోస్ మిషన్లను బ్యాంకులు, సాఫ్ట్‌వేర్ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. వాణిజ్యపన్నుల శాఖలో 19వేల మిషన్లు అవసరం కాగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 13వేలు, ఆంధ్రాబ్యాంక్ 2,180 సరఫరా చేయటానికి అంగీకరించాయి. ఇప్పటికే ఈ శాఖలో 6,238 మిషన్లు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖకు 7,500 మిషన్లు అవసరం కాగా, డిజిట్ సెక్యూర్ పోస్ మిషన్లు 2,500, కార్డ్ రీడర్స్ 5వేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఇప్పటికే 281 మిషన్లు ఏర్పాటు చేశారు. ఏపిఎస్‌ఆర్టీసీలో 5వేల మిషన్లు అవసరం కాగా, ఎస్‌బిఐ 3వేలు, హెచ్‌డిఎఫ్‌సి రెండువేల మిషన్లు పెట్టనున్నాయి. ఇప్పటికే 265 మిషన్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాలకు అవసరమైన 880 మిషన్లను యాక్సెస్ బ్యాంకు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 154 మిషన్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మీ సేవ కేంద్రాలకు అవసరమైన 3,088 మిషన్లను పేనియర్ సొల్యూషన్స్ సంస్థ సరఫరా చేస్తుంది. ప్రస్తుతానికి 260 ఏర్పాటు చేశారు. ఏపి ఆన్‌లైన్ కేంద్రాలకు కావలసిన 13వందల మిషన్లను పిన్ ల్యాబ్స్ సంస్థ సరఫరా చేస్తుంది. ఇప్పటికే ఈ కేంద్రాల్లో 80మిషన్లను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ శాఖకు అవసరమైన 240 మిషన్లను ఎస్‌బిఐ అందజేస్తుంది. ఇప్పటికే 40 మిషన్లను సరఫరా చేసింది. సివిల్ సప్లైస్‌లోని గ్యాస్ డీలర్లకు కావలసిన 820 మిషన్లను ఆంధ్రాబ్యాంక్ సరఫరా చేస్తుంది. అలాగే మరో పదివేల మొబైల్ ఫోస్ మిషన్లను కూడా ఆంధ్రా బ్యాంక్ అందజేస్తుంది. గ్రామాల్లోని షాపుల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కావలసిన 5వేల మిషన్లలో ఎస్‌బిఐ రెండువేలు, ఐసిఐసిఐ వెయ్యి మిషన్లను సరఫరా చేస్తాయి. రైతుబజార్లు, చెక్‌పోస్టుల వద్ద 2,500 మిషన్లు కావలసి వుంది. వాటిలో రెండువేలు ఎస్‌బిఐ, 500 ఆంధ్రాబ్యాంకు అందజేస్తాయి. కార్మికశాఖకు కావలసిన 19వేల మిషన్లను విజన్ టెక్ సంస్థ 15వేలు, అనలాజిక్ సంస్థ నాలుగు వేలు సరఫరా చేస్తాయి. ఈ శాఖలో శుక్రవారం ఒక్కరోజే 294 మిషన్లు ఏర్పాటు చేశారు.