రాష్ట్రీయం

15మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జిల్లాలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్న 15 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 8 లక్షల నగదు, పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్ మండలం రాఘవపురంలో వ్యాస్ అనే ఎన్‌ఆర్‌ఐకి చెందిన 24 ఎకరాల స్థలంపై కొందరి కన్నుపడింది. మహేష్ అనే వ్యక్తి ఎన్‌ఆర్‌ఐ తీరులో జితేందర్ కుమార్ భండారి అనే మరో వ్యక్తిని ఆ స్థలం యజమానిగా గ్రామస్థులకు పరిచయం చేశాడు. మహేష్‌తోపాటు మరో 21మంది ముఠాగా ఏర్పడి డాక్యుమెంట్ రైటర్ ద్వారా నకిలీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న అసలు వ్యాస్ వారం రోజుల క్రితం రాచకొండ కమిషనర్‌కు ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 15మంది యువకులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులను పట్టుకోవాల్సి ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ ఎంఎం భగవత్ తెలిపారు.