రాష్ట్రీయం

జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ నార్త్‌జోన్ పోలీసులు ‘చేయూత’ పేరుతో లాలాగూడ రైల్వే హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించిన అనంతరం నాయిని మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసు వ్యవస్థ పటిష్టమై సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని, ఆధునిక టెక్నాలజీతో నేరాల అదుపునకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మంత్రి నాయిని నర్సింహారెడ్డి