రాష్ట్రీయం
ఎంజిఆర్ విగ్రహ శిల్పికే జయ విగ్రహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 7 December 2016
కొత్తపేట, డిసెంబర్ 6: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్కుమార్ వడయార్ తయారుచేస్తున్నారు. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలోని ఎమ్జిఆర్ రీసెర్చ్ యూనివర్సిటీలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఎంజిఆర్ విగ్రహాలను తయారుచేసి తమిళనాడులో ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక యూనివర్సిటీ తనకు ప్రత్యేక ఆర్డరు ఇచ్చినట్లు వడయార్ తెలిపారు. గతంలో తాను తయారు చేసిన ఎంజిఆర్ విగ్రహాన్ని చూసి జయలలిత అభినందించినట్టు చెప్పారు. ఒక కళాకారుడుగా కళాకారిణి విగ్రహం తయారు చేయటం తన అదృష్టంగా భావిస్తున్నానని వడయార్ పేర్కొన్నారు.