రాష్ట్రీయం

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: భవనం కూలిన ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్ కుమార్ నాయక్‌ను కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నర్ తదితరులతో టెలిఫోన్‌లో ఆయన సమీక్షించారు. ఇంకా శిథిలాల కింద మరో పది మంది ఉన్నట్టు బాధితులు పేర్కొన్నారని మంత్రి అన్నారు. స్థానిక కార్మిక శాఖ అధికారులు, నగర మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయం చేసి తక్షణ సాయం అందించాలని ఆయన డిప్యూటి సెంట్రల్ లేబర్ కమిషనర్ పిఎం శ్రీవాత్సవను ఆదేశించారు. చత్తీస్‌గఢ్ కార్మిక మంత్రి లాల్ రాజ్‌వాడేతో మాట్లాడి మరణించిన కార్మికుని కుటుంబ సభ్యులకు ఆ సమాచారాన్ని అందించాలని సూచించారు. అలాగే మృతుల్లో విజయనగరం జిల్లాకు చెందిన వారున్నారన్న సమాచారాన్ని సైతం మంత్రి ఆ జిల్లా కలెక్టర్‌కు అందించారు. అనంతరం ఆయన సిఎం కెసిఆర్‌ను ఢిల్లీలో కలిసి కేంద్ర ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలను వివరించారు.