రాష్ట్రీయం

సిఎస్ పదవీకాలం పొడిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగించాలని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. టీఆర్‌ఎస్ ఎంపీలు జితెందర్ రెడ్డి వినోద్‌కుమార్,బూర నర్సయ్యగౌడ్ తదితరులు ముఖ్యమంత్రి లేఖను పార్లమెంట్‌లో ప్రధానిని కలిసి అందజేశారు.ప్రధానిని కలిసిన అనంతరం ఎంపీ జితేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదటగా సమర్థించి విలువైన సూచనలు అందించిన ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ను అభినందించినట్టు వెల్లడించారు.పార్లమెంట్‌లో లోక్‌సభలో టి.ఆర్.ఎస్ పార్టీ 193 రూల్ కింద లోక్‌సభలో చర్చ ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. సామాన్య ప్రజలకు మేలు చేసేందుకే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోన్నమని ప్రధాని మోదీ తమకు వివరించారని తెలిపారు. ప్రజలకు ఎదురవుతున్న కష్టాలను సమస్యలను పరిష్కరించేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రధాని కోరినట్టు వెల్లడించారు.