రాష్ట్రీయం

టిటిడి నిర్ణయం సరైనదే: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తిరుమలలో లడ్డూల తయారీలో వినియోగించే శనగపప్పును నేరుగా మిల్లర్లనుంచే సేకరించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం సబబేనంటూ హైకోర్టు సమర్థించింది. టిటిడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెసర్స్ రాజేష్ కార్పొరేషన్, నారాయణ్ ట్రేడింగ్ కార్పొరేషన్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గతంలో తమ వద్ద నుంచి శనగపప్పును టిటిడి సేకరించేదని పిటిషనర్లు పేర్కొన్నారు. కాగా ఈ నెల 9వ తేదీన టిటిడి జనరల్ మేనేజర్ తమ సంస్థలను జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. తమను కూడా టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించాలని వారు కోరారు. నాణ్యత దృష్ట్యా మిల్లర్ల నుంచి నేరుగా శనగపప్పును సేకరించేందుకు నిర్ణయించామని, అలాగే వ్యయం కూడా తక్కువగా ఉంటుందని టిటిడి కోర్టుకు తెలిపింది.