రాష్ట్రీయం
సీమ పరువు తీయవద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 November 2015
హైదరాబాద్, నవంబర్ 27: రాయలసీమకు ఏదైనా న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనేనని రాయలసీమ యూత్ఫోర్స్ కన్వీనర్ మద్దిపట్ల సూర్యప్రకాశ్ అన్నారు. సీమ జిల్లాలను దేశంలోనే అభివృద్ధి చెందిన జిల్లాలుగా తీర్చిదిద్దాలనే మహాసంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు. రాయలసీమకు ఎవరు ఏం చేశారో తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడ్డం సరికాదని ఆయన ఒక ప్రకటనలో హితవు పలికారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం ప్రజా నాయకులు చేయాల్సిన పని కాదని అన్నారు. వైఎస్, కిరణ్ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది, రాజ్యసభ సభ్యుడిగా మైసూరా హయాంలో, మంత్రిగా పని చేసిన బైరెడ్డి హయాంలో సీమ అభివృద్ధికి ఎవరు ఏం చేశారో వెల్లడించాలని అన్నారు.