రాష్ట్రీయం

ఎయిరిండియాదే పొరపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: అమెరికా నుండి విద్యార్థులను వెనక్కి పంపించిన ఘటనలో అమెరికా యూనివర్శిటీలు, భారత ప్రభుత్వం పరస్పరం ఆరోపణలకు దిగుతున్నాయి. యూనివర్శిటీలకే గుర్తింపు లేదని భారత విదేశాంగ శాఖ పేర్కొనగా, విద్యార్థుల్లో సత్తా లేదని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు మాత్రం ఎయిర్ ఇండియాదే పొరపాటని పేర్కొంటున్నాయి. అమెరికా వస్తున్న భారతీయ విద్యార్థులను అడ్డుకోవడంలో ఎయిర్ ఇండియాదే పొరపాటని అమెరికా వర్శిటీలు నిందిస్తున్నాయి. ఎయిర్ ఇండియా చర్యల వల్లనే విద్యార్థుల్లో గందరగోళం చెలరేగిందని వెల్లడించాయి. ఎయిర్ ఇండియా చర్యల వల్ల ఈ ఇబ్బందులు తలెత్తాయని భావిస్తున్నట్టు నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ అధ్యక్షుడు పీటర్ హసెహ్ విద్యార్థులకు ఈ-మెయిల్ పంపించారు. విశ్వవిద్యాలయం ఖ్యాతికి మచ్చ తెచ్చి, పూడ్చలేనంత నష్టాన్ని ఎయిర్ ఇండియా ఎందుకు కలిగించిందో తమకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది ఎదురైందని వివరించారు. అమెరికా నుండి విద్యార్థులను తిరిగి పంపిస్తే సంస్థపై ఆర్థిక భారం పడుతుందని భావించి ఎయిర్ ఇండియా విమానాశ్రయాల్లోనే అడ్డుకుందని అన్నారు. చాలా మంది ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ వర్శిటీల్లో చేరుతున్నారని, రెండో దశ పరిశీలనకు వెళ్లినపుడు సరైన పత్రాలు, సమాధానాలు తెలిపిన వారిని మాత్రమే అమెరికాలో అనుమతిస్తారని వెల్లడించారు. తమ వర్శిటీలో ఎఫ్-1 విద్యార్థులకే గాక, హెచ్-1 వీసాపై వచ్చిన వారు కూడా రావచ్చని పేర్కొన్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దని అన్నారు. అడ్డుకున్న విద్యార్థులు విషయాన్ని పెద్దది చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది సరికాదని, ఇంటర్వ్యూల్లో పేలవమైన ప్రదర్శన కనబరచడం వల్లనే వారు వెనుదిరగాల్సి వచ్చిందని, ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకూ చెప్పకుండా వర్శిటీపై ఆరోపణలు సరికాదని అన్నారు. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలో విఫలమైన కొద్ది మంది విద్యార్థులను మాత్రమే భారత్‌కు తిప్పిపంపించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే వర్శిటీ ఆరోపణలపై ఎయిర్ ఇండియా మాత్రం స్పందించలేదు.

పోలీసు హౌసింగ్ సంస్థ
క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగ సంఘం నూతన సంవత్సరం 2016 క్యాలెండర్‌ను పోలీసు హౌసింగ్ సంస్థ చైర్మన్ రావులపాటి సీతారామారావు బుధవారం ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో హౌసింగ్ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. పోలీసుశాఖకు అత్యంత ఆధునికమైన వౌలిక సదుపాయాలతో కార్యాలయాలు, గృహ సముదాయాలను నిర్మిస్తామని ఆయన తెలిపారు.
కార్పొరేషన్ వైస్‌చైర్మన్ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్ సీతారామరాజు పాల్గొన్నారు.