రాష్ట్రీయం

ఎస్పీవైరెడ్డికి బాబు పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జనవరి 6: కర్నూలు జిల్లా నంద్యాల ఎంపి ఎస్పీవైరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. వీల్‌చైర్‌లో ఉన్న ఎస్పీవైరెడ్డి వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీవైరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ నంద్యాలకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలుసుకుని కుటుంబ సభ్యులతో కలిసి వీల్‌చైర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన విఐపి లాంజ్‌లో నిరీక్షించారు. హెలిక్యాప్టర్ నుంచి దిగిన ముఖ్యమంత్రి విఐపి లాంజ్‌లో వీల్‌చైర్‌లో కూర్చున్న ఎస్పీవై రెడ్డి చెంతకు చేరి రెండు నిమిషాల పాటు మాట్లాడారు. ఆరోగ్యం గురించి విచారించారు. రెడ్డి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపారు.