రాష్ట్రీయం

సీతారాముల కల్యాణం టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 13: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 11 వరకు నిర్వహించే సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలను దేవస్థానం ఇఓ తాళ్లూరి రమేశ్‌బాబు ప్రారంభించారు. ఏప్రిల్ 5న సీతారాముల కల్యాణం వీక్షించేందుకు సెక్టార్ల వారీగా టిక్కెట్లు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.్భద్రాచలంఆన్‌లైన్.కామ్ వెబ్‌సైట్‌లో రూ.5000, రూ.2000, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టిక్కెట్లు ఉంచినట్లు ఆయన వివరించారు. ఏప్రిల్ 6న పట్ట్భాషేకం వీక్షించేందుకు రూ.250, రూ.100 టిక్కెట్లు ఉంచినట్లు వెల్లడించారు. ఉభయదాతలు టిక్కెట్లు రూ.5 వేలవి దేవస్థానం ఇఓ కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంచామని, 08743-232428 అనే నెంబర్‌ను సంప్రదించాలని ఇఓ రమేశ్‌బాబు భక్తులకు సూచించారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు అందించేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లను పోలీసుల సూచనల ప్రకారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అనువైన స్థలాలను సోమవారం ఇఓ రమేశ్‌బాబు, సిఐ బాణాల శ్రీనివాసులు, ఎఇఓ శ్రావణ్‌కుమార్, డిఈ రవీందర్ పరిశీలించారు.