రాష్ట్రీయం

వైభవంగా రాజన్న కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మార్చి 15: కరీంనగర్ జిల్లా వేములవాడ లో బుధవారం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల దివ్యకల్యా ణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తాన బుధవారం ఉదయం 10.30గంటలకు కళ్యాణతంతును ఆలయ అర్చకులు ప్రారంభించారు. పార్వతీదేవి నొసటన కల్యాణ బొట్టును,బుగ్గన కాసింత దిష్టిచుక్కను పెట్టకొని ఆలయ అధికారులు సమర్పించిన పట్టువస్త్రాలను ధరించి పార్వతీదేవి పెళ్లికూతురయ్యింది. కల్యాణ ఘడియ కోసం భక్తులు ఒళ్ళంత కళ్లుచేసుకొని ఎదురుచూశారు. అనుకున్న సమయం రానే వచ్చింది. శివపార్వతుల శూలాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య పార్వతీదేవిని రాజరాజేశ్వరస్వామి వైభవోపేతంగా పరిణయమాడాడు. ఒకవైపు స్వామివారి దివ్యకల్యాణ తంతు జరుగుతుంటే మరోవైపు శివపార్వతులు నెత్తిపై జీలకర్ర బెల్లం పెట్టుకొని శూలాలు ఊపుతూ శివుడిని వివాహం చేసుకున్నారు. ఉత్సవమూర్తులపై తలంబ్రాలు పడుతుంటే శివపార్వతులు కూడా తమ శిరస్సుపై అక్షింతలను చల్లుకున్నారు. యాభైవేలకు పైగా భక్తులు, శివపార్వతుల దివ్యకల్యాణాన్ని తిలకించారు. అర్చకులు ప్రతా ప శ్రీనివాస్ రాజేశ్వరి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఇవో రాజేశ్వర్, నగర పంచాయితీ వైస్ చైర్మ న్ ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు.