రాష్ట్రీయం

దావోస్‌కు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: తెలుగుదేశం అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి 24 వరకూ దావోస్‌లో సిఎంతోపాటు పదిమంది బృందం పర్యటించనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో సిఎం బృందం పర్యటన చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. సిఎం బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్‌బాబు, సిఎం కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఐఅండ్‌సి శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఎకనామిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిఇఓ జాస్తి కృష్ణకిశోర్, పెండ్యాల శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ అధికారి ముద్రగడ నాగేంద్రరావు ఉన్నారు. 19న ఈ బృందం బయలుదేరి 24 వరకూ పర్యటిస్తుంది. ఈమేరకు కేంద్ర అనుమతి కూడా పొందింది. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సిఎం ప్రతినిధి బృందం పాల్గొంటుంది.