రాష్ట్రీయం

మహేష్ బాబు హాజరు కావల్సిందే: కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: శ్రీమంతుడు సినిమా కథ వివాదానికి సంబంధించిన కేసులో నటుడు మహేష్‌బాబు వ్యక్తిగతంగా హాజరుకావల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. తాను రాసిన చచ్చేంత ప్రేమ నవల కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారంటూ రచయిత శరత్‌చంద్ర గతంలో నాంపల్లి కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ, ఎర్నేని శివలను హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుండి హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో తనకు బదులు మరొకరు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ మహేష్‌బాబు నాంపల్లి కోర్టును కోరారు. అయితే కోర్టు వ్యక్తిగతంగా హాజరుకావల్సిందేనని స్పష్టం చేసింది.