రాష్ట్రీయం

సమ్మె జరుగుతున్నా.. కార్మికుల హాజరు పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: సమ్మె ప్రారంభమైన తర్వాత నాలుగవ రోజు 77 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారని సింగరేణి యాజమాన్యం తెలిపింది. ప్రారంభమైన తొలిరోజుతో పోలిస్తే 45 శాతం అధికంగా కార్మికులు విధులకు హాజరయ్యారని స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి సంస్థలకు రోజూ కన్నా సమ్మె కాలంలోనే అధికంగా బొగ్గు సరఫరా చేశామని తెలిపింది. సాధారణ రోజుల్లో రోజుకు సగటున 25 రేక్స్ ద్వారా బొగ్గు రవాణా జరిగితే, సమ్మె రోజుల్లో 28 రేక్స్ ద్వారా రవాణా చేసినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. మిగిలిన కార్మికులంతా కూడా విధులకు హాజరై వేతనం నష్టపోకుండా చూసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.