రాష్ట్రీయం

13, 20 తేదీల్లో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 9 : ఎక్కువమంది వయోవృద్ధులు, దివ్యాంగులు, ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13, 20 తేదీల్లో 65 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు, దివ్యాంగుల కోసం టిటిడి 4వేల టోకెన్లను జారీచేయనుంది. ఉదయం 10 గంటలకు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2 గంటలకు రెండువేల టోకెన్లు, 3 గంటలకు వెయ్యి టోకెన్లు జారీ చేయనుంది. ఐదేళ్లల్లోపు చంటి పిల్లలను వారి తల్లిదండ్రులను ఈనెల 14, 21 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు.