రాష్ట్రీయం

హిందూమతాన్ని కించపరిస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 16: హిందూమతం ఏ మతానికి శత్రువు కాదని, అలాగని హిందూమతాన్ని కించపరిచేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకునే ప్రసక్తి లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయి తొగాడియా స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ఖమ్మంలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడుతూ హిందువులు అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి గ్రామంలోనూ హిందువులు ప్రబల శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి పౌరుడు ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలని, అంతకంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించాలన్నారు. గోరక్షణ హిందూ ధర్మమని, దానిని పరిరక్షిస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా తయారు చేసేందుకు విశ్వహిందూ పరిషత్ కసరత్తు చేస్తుందన్నారు. ఇప్పటికే ఇండియా హెల్త్‌లైన్ ప్రారంభించామని, ఇందులో వైద్యులను భాగస్వామ్యులను చేసి రోజుకు లక్షమందికి ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఆయన ప్రకటించారు. పేద రోగులకు అవసరమయ్యే వైద్య సహాయ వేదికగా ఇది పనిచేస్తుందన్నారు. దీనిలో ఆరోగ్య సహాయకులుగా ఎవరైనా చేరవచ్చని పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ప్రజా సేవలో నిమగ్నం కావాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూనే దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉందన్నారు. ప్రభుత్వం ఏదో చేస్తుందని చూసేకంటే తామే ముందు సేవామార్గం వైపు పయనించాలన్నారు. తమ మార్గంలోకి ఇప్పటికే వేలాదిమంది మేధావులు వచ్చారని, వారంతా సేవా కార్యక్రమాల ద్వారా దేశాభివృద్ధిలో కీలకంగా మారనున్నారని స్పష్టం చేశారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని, , అయితే మత మార్పిడులను బలవంతంగా చేపడితే ఊరుకోమన్నారు.

చిత్రం..ఖమ్మంలో జరిగిన మేధావుల సదస్సులో పాల్గొన్న తొగాడియా