రాష్ట్రీయం

తల్లీకొడుకు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 22: చేసిన అప్పులు తీర్చుకోలేక సొంత ఊరులో తలెత్తుకుని తిరగలేక తల్లీకొడుకు తిరుమలలో బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. తిరుమలలోని పిఏసి-3 (మాధవ నిలయం) వద్ద ఓ యువకుడు, ఓ మహిళ విగతజీవులై పడి ఉండటాన్ని భక్తులు గుర్తించి కలవరపాటుకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టిటిడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
తిరుమల టు టౌన్ సిఐ సిబ్బందితో అక్కడకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారి వద్ద లభించిన ఆధారాల ప్రకారం చిత్తూరుకు చెందిన పుష్ప (50), శేఖర్ (37)లుగా గుర్తించారు. గత నెల రోజులుగా వీరు తిరుమలలోనే ఉంటున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి మరణాలకు కారణాలను అనే్వషించారు.
వ్యవసాయంలో నష్టపోయి చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుసుకున్నారు. రెండు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.