రాష్ట్రీయం

టి. కాంగ్రెస్ గూటికి వలసల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలుగుదేశం సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తరువాత కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. కరుడుగట్టిన టిడిపి వాధులుగా పేరొందిన వారు సైతం పార్టీని వీడేందుకు వెనుకాడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజక వర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె. ఉదయ్ మోహన్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పి రేవంత్ సమక్షంలో మాజీ మంత్రి సబిత, యువనేత కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్టు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కార్తీక్ రెడ్డి చెప్పారు.