రాష్ట్రీయం

రెండు రైళ్ల వేళల్లో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: సికింద్రాబాద్ డివిజన్‌లోని ఎర్రుపాలెం-తొండలగోపవరం రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల మరమ్మతులు కారణంగా ఆ రూట్లో నడిచే రెండు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.77292 విజయవాడ- భద్రాచలం రోడ్ పాసింజర్ రైలు ఈ నెల 6 నుంచి 12 వరకు ఉదయం 8 గంటలకు బదులు ఉదయం 10 గంటలకు బయలు దేరుతుందని తెలిపింది. అలాగే నెం.77291 భద్రాచలం రోడ్-విజయవాడ పాసింజర్ రైలు మధ్యాహ్నాం 1.45కి బదులు మధ్యాహ్నాం 3.45 గంటలకు బయలు దేరుతుందని రైల్వే తెలిపింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.