ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయంతో పాటు వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 27: సింగపూర్‌కు 34 మందితో కూడిన రెండో విడత రాజధాని ప్రాంత రైతుల బృందం సోమవారం బయలుదేరింది. సచివాలయంలోని మూడో బ్లాక్ నుంచి బస్సులో బయలుదేరిన రైతుల బృందానికి డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు వ్యాపారంలోనూ రైతులు ప్రావీణ్యత సంపాదించడానికి సింగపూర్ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాలుగురోజులపాటు రెండో విడత రైతుల బృందం సింగపూర్‌లో పర్యటిస్తుందన్నారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ సింగపూర్ పర్యటన కోసం 123 మంది రైతులను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. గతనెల 31 నుంచి ఈ నెల 3వ తేదీ వరకూ మొదటి విడత కింద 34 మంది రాజధాని ప్రాంత రైతులు సింగపూర్‌లో పర్యటించారన్నారు. రెండో విడతగా మరో 34 మంది సింగపూర్ వెళుతున్నారన్నారు. చంద్రబాబునాయుడిపై నమ్మకంతో వారంతా తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చారన్నారు. అంతర్జాతీయ స్థాయి నగరం ఎలా ఉంటుంది, ఎలాంటి అవకాశాలు లభిస్తాయి అనే వివరాలు ఈ పర్యటనలో రైతులు తెలుసుకుంటారన్నారు. ఒకప్పుడు మత్స్యకార గ్రామమైన సింగపూర్, నేడు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా ఎలా రూపొందింది రైతులు ప్రత్యక్షంగా తిలకించనున్నారన్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రైతులకు సింగపూర్‌లో నివాస, భోజన వసతి సదుపాయాలను ప్రభుత్వమే భరిస్తుందని మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రైతులతోపాటు ముగ్గురు అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సింగపూర్‌ను తలదనే్నలా నిర్మిస్తున్న రాజధాని ఎలా ఉండబోతుందో ఈ పర్యటన ద్వారా రైతులకు అవగాహన ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీ్ధర్, పలువురు రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు.
చిత్రం..సింగపూర్ వెళుతున్న రైతుల బస్సుకు పచ్చజెండా ఊపుతున్న ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మునిసిపల్ మంత్రి నారాయణ