రాష్ట్రీయం
అంతపనీ అమ్మే చేసింది!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శేరిలింగంపల్లి, జనవరి 22: చందానగర్లో విషాదం చోటుచేసుకుంది. తన తొమ్మిది నెలల పసిగుడ్డును ఎత్తుకుని తల్లి అపార్టుమెంటుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీజేఆర్ ఎన్క్లేవ్ రోడ్డులో గల కేఎస్ఆర్ ఎన్క్లేవ్ కాలనీలో గల సాయి పెరల్ రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 503లో స్వాతి, ప్రదీప్ కుమార్ దంపతులు నివసిస్తున్నారు. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా భార్య గృహిణి. వీరికి అయిదేళ్ల కొడుకు అరుష్రామ్, తొమ్మిది నెలల కూతురు సాన్వి
ఉన్నారు. కాగా తమ చిన్నారి తరుచూ అనారోగ్యానికి గురికావడంతో తట్టుకోలేని తల్లి తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం మధ్యాహ్నం ఐదు అంతస్తుల అపార్టుమెంటు టెర్రస్పై నుంచి కూతురును పట్టుకుని కిందకు దూకింది. రక్తపు మడుగులో పడి తల్లీకూతురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతురాలు తండ్రి ఎం.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చందానగర్ ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రావుఆధ్వర్యంలో ఎస్ఐ వేణుకుమార్ దర్యాప్తు చేస్తున్నారు.