రాష్ట్రీయం

31న చంద్రగ్రహణం.. శ్రీశైలం ఆలయం మూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 22: చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 31వ తేదీ శ్రీశైలం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం ఈఓ భరత్‌గుప్తా తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి మరుసటి రోజు ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటల వరకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ద్వారాలు మూసివేస్తున్నట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, స్వామి అమ్మవార్ల ప్రాతఃకాల పూజల అనంతరం ఉదయం 6.30 గంటల నుండి స్వామి వార్ల దర్శనాలు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు. రని ఆలయాధికారులు తెలిపారు. 31వ తేదీ 7.30 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆ తరువాత ఆలయాన్ని మూసివేస్తామన్నారు.