రాష్ట్రీయం

ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించరాదని, అంతవరకు వైకాపా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతుందని వైకాపా సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో వైకాపా కార్యాలయంలో రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జెండాను ఎగురవేశారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ మహాశయుడు స్ఫూర్తిగా రాజ్యాంగ పరిరక్షణకు కేంద్రం పూనుకోవాలన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాను ఆంధ్రాకు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుల ఆశయాల సాధనకు వైకాపా అంకిత భావంతో పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.